నందిస్తున్నారు. రూ.2 కోట్లకుపైగా ఎంజేఆర్ ట్రస్ట్ నిధులతో తిమ్మాజిపేట ఉన్నత పాఠశాల భవనాన్ని తీర్చిదిద్దారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి జమున నిరంతర పర్యవేక్షణలో నభూతో.. నభవిష్యత్ అన్న చందంగా రూపుదిద్దుకున్నది. కేవలం పది నెలల్లోనే కార్పొరేట్ను తలదన్నేలా భవనాన్ని సుందరీకరించారు. ప్రతి గదిలో అధునాతనమైన ఫర్నిచర్, ఫ్యాన్లు, బేంచీలు, బ్లాక్ బోర్డులు, లైట్లు, వంటశాల, డైనింగ్ హాల్, టాయిలెట్లు నిర్మించారు.
తిమ్మాజిపేట, నవంబర్ 10 : మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి మర్రి జమున స్థాపించిన ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్లకు పైగా నిధులతో పాఠశాల భవనం అనతి కాలంలోనే పూర్తయింది. ఈ భవనం న భూతో.. న భవిష్యత్గా రూపుదిద్దుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉంటాయా.. అన్నట్లుగా నిర్మించారు. ఎల్ ఆకారంలో రెండంతస్తుల నూతన భవనంతోపాటు పాత భవనానికి మరమ్మతులు చేపట్టి పూర్తిగా సుందరీకరించారు. పనుల్లో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి తరగతి గదిలో అధునాతనమైన ఫర్నీచర్, ఫ్యాన్లు, బెంచీలు, బ్లాక్ బోర్డ్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక గది, భోజనం కోసం మరో గది, అల్మారాలు, అధునాతనమైన టాయిలెట్లు, ప్రత్యేక వంటశాల, విద్యార్థులు కూర్చొని తినేందుకు వీలుగా డైనింగ్ హాల్ నిర్మించారు. గతంలో ఇరుకుగా ఉన్న మైదానాన్ని విశాలం చేశారు. వాలీబాల్, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ప్రహరీకి మరమ్మతులు చేపట్టారు. పాఠశాల ఆవరణలో పూలమొక్కలు నాటి ఆహ్లాదకరంగా మార్చారు. జడ్చర్ల-నాగర్కర్నూల్ ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న పాఠశాల మండలకేంద్రానికి గీటురాయిగా మారింది. ఇటీవల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రతినిధులు సందర్శించి.. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాఠశాలగా ప్రకటించారు. రాజకీయ నాయకులు స్వప్రయోజనాలు ఆశిస్తారని.. కానీ ప్రజల కోసం పనిచేసిన నేత ఎమ్మెల్యే మర్రి అని.. పాఠశాల నిర్మాణం చేపట్టి ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతారని ఉన్నత స్థాయి ఉద్యోగి పేర్కొన్నారు.