యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనబోమని కేంద్రం తెగేసి చెబుతున్న తరుణంలో రాష్ట్ర
ప్రభుత్వం కర్షకులను అప్రమత్తం చేస్తున్నది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు
చేయాలని సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా నర్వ మండలం బెక్కెరపల్లి గ్రామ
రైతులు చైతన్య వంతులయ్యారు. వరితో ఒరిగేది లేదని 150 ఎకరాల్లో మినుములు సాగు
చేశారు. ముందుగా రైతు వెంకటన్న ఈ పంట వేసి లాభాలు ఆర్జించగా.. మిగతా వారు ఆయన బాటలో పయనిస్తున్నారు. ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ ఉండడంతో పాటు కేవలం 80 రోజుల్లోనే పంట చేతికి వస్తుండడంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇతర పంటలు సాగు చేయడంతో భూమి సారవంతం కావడంతోపాటు పంట మార్పిడిలో ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆత్మకూరు, నవంబర్ 9 : తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన పేదల ఆరాధ్యదైవం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకార మహోత్స వం మంగళవారం కనుల పండువగా సాగింది. ఈ మహోత్సవానికి వేదికైన వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు గోవింద నామస్మరణతో మార్మోగింది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భద్రపర్చిన స్వామివారి స్వర్ణాభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగించారు. అంతకుముందు బ్యాంకు మేనేజర్ ప్రసాద్రావు, అసిస్టెంట్ మేనేజర్ విజయభాస్కర్ క్షేత్ర అధికారులు ప్రవీణ్కుమార్, అబ్దుల్ గఫూర్ సమక్షంలో దేవాదాయశాఖ ఈవో సార శ్రీనివాస్ బ్యాంకు లాకర్ నుంచి ఆభరణాల పెట్టెను బయటకు తీశారు. అనంతరం మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట సీతాదయాకర్రెడ్డి దంపతులు, టీఆర్ఎస్ నాయకులు వర్కటం జగన్నాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ఇతర నాయకగణం ఆభరణాలకు బ్యాంకులో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆధ్వర్యంలో జరిపిన పూజల అనంతరం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గాడి వంశస్తులైన శేషాచారి ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకొని ఊరేగింపు ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోలాహలం మధ్య స్వర్ణాభరణాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. రెండు ఎల్ఈడీ టీవీల ద్వారా ఈ ఉత్సవాన్ని మున్సిపల్ పాలక మండలి ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఊరేగింపు పొడవునా వేలాది భక్తులు స్వర్ణాభరణాలను మొక్కేందుకు పోటీ పడ్డారు. మంగళ వాయిద్యాలు, కుర్వడోళ్లు, బ్యాండ్ భాజాలతో ఊరేగింపు సంప్రదాయంగా సాగింది. కురుమూర్తి గ్రామానికి చెందిన వివేకానంద స్కూల్ విద్యార్థులు కోలాటం ఆడారు. పటాకులు, డీజే సౌండ్స్ హోరుతో పట్టణం దద్దరిల్లింది. పట్టణం శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్టపై పరమశివుడి ఆలయానికి అభిముఖంగా ఎమ్మెల్యేలు పూజలు చేసి ఆభరణాలను సాగనంపారు. అక్కడి నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా భారీ ఊరేగింపుతో కురుమూర్తి గి రులకు చేరాయి. ఊరేగింపు పొడవునా ఆత్మకూరు సీఐ కే.ఎస్.రత్నం, భూత్పూరు సీఐ రజితారెడ్డి నే తృత్వంలో 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 100 మంది పోలీసు సిబ్బంది, 50 మంది రిజర్వ్ ఫోర్స్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీ యాదవ్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కమిషన ర్ రమేశ్, ఎస్సై రాఘవేంద్ర, నాయకులు వీరేశలింగం, గాడి లక్ష్మీనారాయ ణ, అనిల్గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాల ఊరేగింపు..
అమరచింత, నవంబర్ 9 : పట్టువస్ర్తాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో చేనేత కార్మికుడు దేవరకొండ లచ్చన్న ఇంట్లో మంగళవారం పద్మశాలీ కులస్తులు, భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనతంరం పట్టణంలోని భక్త మార్కండేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. భాజాభజంత్రీల నడుమ భక్తి శ్రద్ధలతో పట్టువస్ర్తాలను ఊరేగించి స్వామి సన్నిధికి తరలించారు. తిరుమల శ్రీహరి సవరమ్మ దేవాలయం వరకు.. అక్కడి నుంచి వడ్డెమాన్ గ్రామం వరకు సంబరి సత్యనారాయణ, అక్కడి నుంచి కురుమూర్తిస్వామి సన్నిధి వరకు కొంగరి భరత్ ఊరేగింపుగా పట్టువస్ర్తాలను తీసుకెళ్లారు.
సిరులు కురిపిస్తున్న మినుములు
మాకున్న మూడెకరాల్లో మినుములు సాగు చేశాం. రూ.రెండున్నర లక్షల లాభం వచ్చింది. వరిలో అంత లాభం ఉండదు. గతంలో సంప్రదాయంగా పండించిన పంటనే కావడంతో ధైర్యం చేశాం. కేవలం 80 రోజుల్లోపు పంట చేతికి వస్తుంది. పెద్దగా పెట్టుబడి ఉండదు. వరితో పోలిస్తే కూలీల అవసరం, ఖర్చులు బాగా తక్కువ. వరి చేతికొచ్చే సమయంలో రైతులు, కూలీలు బిజీగా ఉంటారు. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మినుములకు అవసరమే లేదు. వీలునుబట్టి పంట కోతలు పెట్టుకోవచ్చు. మమ్మల్ని చూసి గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు.
బంగారుమయంగా స్వామివారు..
దేవరకద్ర రూరల్, నవంబర్ 9 : బ్రహ్మోత్సవాల్లో భాగంగా కురుమూర్తి స్వామి భక్తులకు మంగళవారం మధ్యాహ్నం వరకు సాధారణ రూపంలో దర్శనమిచ్చారు. సాయంత్రం నుంచి బంగారు కురుమూర్తి రాయుడిగా పూజలందుకున్నారు. ఆత్మకూరు నుంచి తీసుకొచ్చిన ఆభరణాలను అర్చకులు ప్రోక్షణ చేసి స్వామి, అమ్మవారికి అలంకరించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, సంస్థానాధీశుడు శ్రీరాంభూపాల్ బంగారు రూపంలో కాంతులీనుతున్న స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, శ్రీరాంభూపాల్, ఆలయ కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించారు. కాగా, రాత్రి స్వామి వారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, పాలక మండలి చైర్మన్ ప్రతాప్రెడ్డి, కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాసులు, తాసిల్దార్ సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.