స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు డిసెంబర్ 10న పోరు జరగనున్నది. ఇందుకోసం 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వచ్చే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటైర్లెన మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 1390 మందికి గానూ 95శాతం మందికి పైగా టీఆర్ఎస్కు చెందిన వారే ఉండడంతో వార్ వన్సైడ్ అయ్యే అవకాశం ఉన్నది.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 9 : ఉమ్మడి జిల్లాలోని 230 దుకాణాలకు నూతన మద్యం పాలసీ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి తెలిపారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మద్యం దుకాణాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీసీ విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్త పాలసీ వ్యాపారులకు లాభదాయకంగా ఉందన్నారు. వ్యాపారులు చివరి రోజు వరకు చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, 20న ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీడిప్ నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో 164 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 230కి పెరిగిందన్నారు. అంటే కొత్తగా 66 దుకాణాలు పెరిగాయన్నారు. లైసెన్స్, దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల ఉంటుందని, ఒక దుకాణానికి ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో గౌడలకు 14, ఎస్సీలకు 10, ఎస్టీలకు 3, నాగర్కర్నూల్ జిల్లాలో గౌడలకు 9, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, వనపర్తి జిల్లాలో గౌడలకు 4, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, గద్వాల జిల్లాలో గౌడలకు 5, ఎస్సీలకు 6 దుకాణాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్ కోటాలో గౌడలకు 32, ఎస్సీలకు 30, ఎస్టీలకు 8 దుకాణాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లోపలికి వచ్చిన వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 14న ఆదివారం సెలవు ఉంటుందన్నారు. 20 నుంచి 22వ తేదీలోపు దుకాణాలు దక్కించుకున్నవారు. మొదటి విడుత లైసెన్స్ ఫీజు చెల్లించాలని, 29న ఆయా దుకాణాలకు మద్యం విడుదల చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా గుడుంబా, గంజా యి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటి వరకు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 96 గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. గుడుంబా చాలా వరకు తగ్గిందని ఆయనన్నారు. ముఖ్యంగా బెల్లం నుంచి సారా తయారు చేస్తారు కాబట్టి జిల్లాలో 95 శాతం బెల్లం ఏ రంగులో ఉన్నా గుడాంబా తయారీకి అని పరిగణించామన్నారు. సీఎం కేసీఆర్ సమావేశం తర్వాత 70 టన్నుల బెల్లాన్ని సీజ్ చేశామని తెలిపారు. బెల్లం అక్రమ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని, పీడీ యాక్టు కేసులు నమోదు చేసి ఏడాది జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మహబూబ్నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, నర్సిరెడ్డి, నాగేందర్గౌడ్, బాలాజీ నాయక్, రఘపతిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్ గౌడ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.