శ్రీశైలం, నవంబర్ 7: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుడి దర్శనానికి ఉభయ తెలుగురాష్ర్టాల నుంచేకాక ఉత్తర, దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల కు అలంకార దర్శనాలు క ల్పించడంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవో లవన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెల్లవారుజుమున కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీపదానాలు చేశారు. స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నారులపై తల్లిదండ్రులు శ్రద్ధ్ద వహించాలని కోరారు. అదేవిధంగా కార్తీక దీపాలను వెలిగించుకునేందుకు భక్తులకు వీలుగా ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏఈవో హరిదాసు తెలిపారు. విద్యుద్దీపకాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిసూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు.
వాహనదారులు సహకరించాలి
శ్రీశైలం వచ్చి వెళ్లే యాత్రికులు సాక్షిగణపతి ఆలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను అడ్డంగా నిలిపివేసి ఆలయ దర్శనానికి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయని పోలీస్ ఎస్సై రమణ పేర్కొన్నారు. యాత్రికులు తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని కోరుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుమారు ఆరు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను అదుపు చేశారు.
పుష్కరిణికి దశవిధ హురతులు
స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్ర్తోక్త పూజలానంతరం పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి ప్రత్యేక పుప్పాలంకరణ, లక్షదీపార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. కార్తీకమాసంలో పుష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మాసంలో ప్రతి సోమవారం పుష్కరిణిహారతి అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ప్రత్యేక ఆకర్షణగా చేసే దశవిదహారతును చూసేందుకు తెలంగాణ ప్రాంతాల వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని శ్రీశైలప్రభ సంపాదకుడు డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు.
శ్రీశైలంలో ప్రభుత్వ విప్
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్నారు. కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేసుకునేందుకు వచ్చినవారు స్థానిక సదాశివ నిత్యాన్నదాన సత్రంలో బసచేశారు.