మహబూబ్నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి శ్రీనివాస్గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. మహబూబ్నగర్-భూత్పూర్ రోడ్డులోని పాలకొండ వద్ద మంత్రి శ్రీనివాస్గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని ఆమె సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాంతమ్మ మృతికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, విప్ గువ్వల, ఎమ్మెల్యేలు డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి శాంతమ్మకు నివాళులు అర్పించారు. వారితోపాటు జెడ్పీ చైర్ పర్సన్లు సరిత, వనజ, పద్మావతి, స్వర్ణమ్మ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, దేవరి మల్లప్ప, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జూపల్లి భాస్కర్రావు, చెరుకుపల్లి రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, కలెక్టర్ ఎస్.వెంకట్రావు తదితరులు ఉన్నారు.
8 వేల సిబ్బందితో భద్రత..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ/టౌన్, నవంబర్ 7 : శాంతమ్మ దశ దినకర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో సీఎం మంత్రి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ స మాధి వద్ద నివాళులర్పించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సుమారు 8 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే సమాధి వద్ద ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి నివాళులరించారు.