ఊట్కూర్, నవంబర్ 7: అర్హులైన యువతీ యువకులు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ తిరుపతయ్య సూచించారు. మండలంలోని పలు బూత్లలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణ, చిరునామా మార్పు, పేర్లలో తప్పులు ఉంటే సవరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఓబ్లాపూర్ ఉపసర్పంచ్ వెంకటేశ్గౌడ్, మాజీ సర్పంచ్ భీంరెడ్డి పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, నవంబర్ 7: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తాసిల్దార్ సురేశ్ పేర్కొన్నారు. ఆదివారం మండలకేంద్రంతోపాటు గుడెబల్లూర్, ముడుమాల, మురహరిదొడ్డి తదితర గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఓటరు నమోదుతోపాటు, జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే ఓటర్లు సరిచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిద్రాంరెడ్డి, కమల, సునీత, వెంకటేశ్వరీ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ బూత్ తనిఖీ
మాగనూర్, నవంబర్ 7: మండలంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 30వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి వరకు 18ఏండ్లు నిండనున్న యువత ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలని, గరుడ యాప్ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నదన్నారు. అదేవిధంగా ఓటరు జాబితాలో తప్పుల సవరణకు సైతం ఈ ప్రత్యేకడ్రైవ్లో అవకాశం కల్పించిందన్నారు. దీంతో కొత్త ఓటర్లతోపాటు పాత వారికి ప్రయోజనం కలుగనున్నదని తెలిపారు. ఓటరు నమోదులో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. తాసిల్దార్ తిరుపతి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఓటు నమోదు కార్యక్రమంపై స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో యువత ఓటుహక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ నర్సింహులు, బీఎల్వోలు, వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామస్తులు పాల్గొన్నారు.