భూత్పూర్, నవంబర్ 7 : అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. ఆదివారం మున్సిపాలిటీలోని ప్రాథమిక పాఠశాలలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొన సాగుతుందని తెలిపారు. 18ఏండ్లు నిండిన వారు నేరుగా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండలవ్యాప్తంగా 46 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏలు, బీఎల్వోలు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, నవంబర్ 7 : మండలంలోని కౌకుంట్లలో ఆదివారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా 18ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కళాకారు లు సూచించారు. అలాగే ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే సరి చేసుకోవాలని, మరణించిన వారి పేర్లు తొలగించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు టంకరి శ్రీనివాస్, వెంకటయ్య, యాదగిరి, రాయ ప్ప, మునిమోక్షం, శీనయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, నవంబర్ 7 : ఓటరు నమోదుపై పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలో ని వెన్నాచేడ్, పగిడ్యాల్, అంచన్పల్లి తదితర గ్రామాల్లో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు జాబితాలో ఉన్న తప్పులను సరి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జనరంజనీ కల్చరల్ అసోసియేషన్ కళాకారులు పాల్గొన్నారు.