జడ్చర్లటౌన్, నవంబర్ 7 : డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలంలోని కోడ్గల్ గ్రా మంలో ఆదివారం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే రైతువేదిక, చిల్డ్రన్స్పార్క్, వాటర్ట్యాంకు నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుదిదశకు చేరుకున్న డబుల్బెడ్రూం ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పూర్తయిన డబుల్బెడ్రూం ఇండ్లను త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు. జడ్చర్ల మండలంలోని కోడ్గల్, చిన్న ఆదిరాల, ఎక్వాయ్పల్లి, పెద్ద ఆదిరాల, చర్లపల్లి, బండమీదిపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో డబుల్బె డ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి సొంతింటి కలను సాకారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్, నాయకులు ఇంతియాజ్ఖాన్, నవీన్రెడ్డి, అంజయ్య, వెంకటయ్య, రామకృష్ణారెడ్డి, రమేశ్, శంకర్, ఏఈ జవహర్బాబు పాల్గొన్నారు.