బాలానగర్, నవంబర్ 6 : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనందిస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 74మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల తల్లిదండ్రులకు అప్పులభారం తగ్గిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. అనంతరం ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం మండలంలోని తిరుమలగిరిలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, రచ్చకట్ట, హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాగా, ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో తిరుమలగిరికి చెందిన సుజాత సొంతింటి కల సాకారమైంది. శనివారం నిర్వహించిన గృహప్రవేశం వేడుకలో ఎమ్మె ల్యే పాల్గొన్నారు. అదేవిధంగా మరో మహిళ నాగమ్మ ఇంటిని ఎమ్మెల్యే పరిశీలించి తన సొంత నిధులతో ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యా దయ్య, ఎంపీపీ కమల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, వైస్ఎంపీపీ వెంకటాచారి, గిరిజన నా యకులు లక్ష్మణ్నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.