జడ్చర్ల, డిసెంబర్ 4 : జడ్చర్ల మున్సిపాలిటీని అన్నివిధా లా అభివృద్ధిపర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం 23వ వార్డు పాతబజార్లో రూ.10లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 25మందికి రూ.35లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం పేదలకు చేయూత అందిస్తున్నదని చెప్పారు. అభివృద్ధిలో జడ్చర్ల ము న్సిపాలిటీని జిల్లాలోనే నెంబర్వన్ స్థానంలో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.
అంబులెన్స్ ప్రారంభం
తెలంగాణ స్టోన్ క్రషర్ అసోసియేషన్ సహకారంతో మండలంలో ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ను క్యాంపు కార్యాలయంలో టీఎస్సీఏ అధ్యక్షుడు కమలాకర్రెడ్డితో కలి సి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర సమయంలో అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకొని అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అలీంకలీషా దర్గాలో ప్రార్థనలు
మున్సిపాలిటీలోని హజ్రత్ అలీంకలీషా దర్గాలో ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ఉర్సును పురస్కరించుకొని దర్గాను సందర్శించి ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ దర్గా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తె లిపారు. కార్యక్రమాల్లో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బా ద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, మున్సిపల్ వైస్చైర్మన్ సారిక, కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, కోట్ల ప్రశాంత్రెడ్డి, లత, రమేశ్, ఉమాదేవి, సతీశ్, మహేశ్, చైతన్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ వైస్ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, పిట్టల మురళి, దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, ఇమ్మూ, శ్రీకాంత్రెడ్డి, జీన్గురాల సత్యం, దానిష్, శంకర్నాయక్, స్టో న్ క్రషర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్కుమార్రెడ్డి, సంజీవరెడ్డి, అలీంకలీషా దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు సుభాన్అలీ, జాఫర్, వహీద్, నసీ ర్, రసూల్, కాలేబ్, మగ్దూం, అసీఫ్ పాల్గొన్నారు.