జడ్చర్ల, డిసెంబర్ 4 : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ సీఎం రోశయ్య మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాని కి తీరనిలోటని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్లలోని నేతాజీచౌక్లో రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే టీఆర్ఎస్ నా యకులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకు లు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘ టించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ పట్టణంలో..
మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీ సీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు పాల్గొన్నారు. అలాగే రోశ య్య మృతిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్ర చార కార్యదర్శి సీజే బెనహర్ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 4 : అడ్డాకుల మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, డిసెంబర్ 4 : ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోశయ్య మృతిపై ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో రోశయ్య చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ న ర్సింహులు, సర్పంచులు గోపాల్గౌడ్, కృష్ణయ్య, వెంకటేశ్, ఆర్యవైశ్య సం ఘం నాయకులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, డిసెంబర్ 4 : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. మండలకేంద్రం లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన రాష్ర్టానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ శెట్టి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ర్టాలకు తీరనిలోటు
మక్తల్ టౌన్, డిసెంబర్ 4 : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య మరణం రెండు తెలు గు రాష్ర్టాల ప్రజలకు, ఆర్యవైశ్యులకు తీరనిలోటు అని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శ్రీనివాస్గుప్తా అన్నారు. శనివారం మాజీ సీఎం రోశయ్య మరణించడంతో పట్టణంలోని తన నివాసంలో చిత్రపటానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు కట్ట సురేశ్, ఆర్యవైశ్య మండల కార్యదర్శి హరి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.