హన్వాడ, డిసెంబర్ 4 : కొవిడ్ వ్యాక్సినేషన్లో వేగం పెంచి 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ రెండు డోసులు వేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. మండలంలోని కొనగట్టుపల్లి గ్రామంలో శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించాలని సూచించారు. అలాగే వలసలు వెళ్లినవారి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేయడ మే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. కరో నా నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూ రం పాటించాలని తెలిపారు. మాస్కు ధరించకపోతే రూ.వె య్యి జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అనంతరం నా యినోనిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, సర్పంచులు చిన్నచెన్నయ్య, మానస తదితరులు పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి : డీపీవో
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 4 : అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని డీపీవో వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని కందూరులో వ్యాక్సినేషన్ ప్ర క్రియను పరిశీలించారు. అలాగే పొన్నకల్లో అధికారులతో కలిసి ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. 18ఏండ్లు నిండినవారు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాసిల్దార్ కిషన్, ఎంపీడీవో మంజుల, సర్పంచులు కల్పనావిజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వందశాతం పూర్తి చేయాలి : జెడ్పీ సీఈవో
జడ్చర్ల, డిసెంబర్ 4 : అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేష న్ ప్రక్రియను 12వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో జ్యోతి అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, ఐకేపీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల మండలంతోపాటు మున్సిపాలిటీలో 18ఏండ్లు నిండినవారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో మొగులప్ప, ఏడీఏ అనిల్కుమార్, డీఎంవో విజయకుమార్, ఏవో గోపినాథ్, సీడీపీవో ఖైరున్నీసాబేగం, ఇన్చార్జి ఎంపీడీవో జగదీశ్, అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్, గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ రాహుల్ తదితరులు ఉన్నారు.
టీకా వేసుకోవాలి
బాలానగర్, డిసెంబర్ 4 : అర్హులైన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు కోరారు. మండలంలోని బోడజానంపేటలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకట్రాములు, మెడికల్ ఆఫీసర్ తులసి, సర్పంచ్ చంద్రకళ పాల్గొన్నారు.
టీకాతోనే ప్రాణానికి రక్ష
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 4 : కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులు సూచిం చారు. మండలంలోని జీన్గురాలలో వైద్యసిబ్బందితో కలిసి ఇం టింటికెళ్లి వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. కార్యక్రమంలో సర్పం చ్ శ్యాంసుందర్రెడ్డి, ఎంపీవో విఘ్నేశ్వర్, ఏఎన్ఎం రేఖ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, డిసెంబర్ 4 : మున్సిపాలిటీలోని అమిస్తాపూర్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ చెన్నకిష్టన్న మాట్లాడుతూ మొద టి డోస్ తీసుకున్న ప్రతిఒక్కరూ రెండో డోస్ తీసుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్నజీబ్, సీహెచ్వో రామయ్య, సూపర్వైజర్ యాదమ్మ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి గండీడ్ మండలంలో..
మహ్మదాబాద్/గండీడ్, డిసెంబర్ 4 : గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. జంగంరెడ్డిపల్లి, షేక్పల్లి, మహ్మదాబాద్ తదితర గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో తాసిల్దార్లు జ్యోతి, ఆంజనేయులు, సర్పంచులు హన్మంతు, ఖాజాహసిబొద్దీన్, పార్వతమ్మ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, డిసెంబర్ 4 : మండలంలోని పలు గ్రామా ల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను తాసిల్దార్ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, వైద్యాధికారి ప్రతాప్చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, డిసెంబర్ 4 : మండలకేంద్రంలో అధికారులు, వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. అంతకుముందు వ్యాక్సినేషన్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుధాకర్, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, మండల వైద్యాధికారి హరినాథ్, సర్పంచ్ గోపాల్గౌడ్, పంచాయతీ కార్యదర్శి సురేందర్, ఏఎన్ఎం వినోదిని పాల్గొన్నారు.