మూసాపేట, డిసెంబర్ 4 : నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వినతి పత్రం అందజేశారు. శనివారం ఎమ్మెల్యే ఆల ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. జాతీయ రహదారి నుంచి బలిదుపల్లి మీదుగా వర్నె, ముత్యాలంపల్లి, పేరూరు, వెంకంపల్లి వరకు ఉన్న రోడ్డును డబుల్ లైన్గా మార్చేందుకు రూ.16 కోట్లు మంజూరు చేయాలని కోరారు. వర్నె, ముత్యాలంపల్లి వాగుపై వర్షాలకు రోడ్డు తెగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వంతెన, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించారు. భూత్పూర్ నుంచి ఏవీఆర్ కాలనీ వరకు బీటీ రోడ్డు రెన్యూవల్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకుగానూ సీఎం కేసీఆర్ ఈఎన్సీని పిలిపించి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ఆల కృతజ్ఞతలు తెలిపారు.