జడ్చర్ల, అక్టోబర్ 20 : రామాయణ రచయిత వాల్మీకి మహర్షిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని సత్యేశ్వర ఆశ్రమంలో బుధవారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సాహిత్యానికి ఆధ్యుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామాయణాన్ని అందించిన వాల్మీకి అడుగుజాడల్లో పయనించాలని కోరారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రఘురాం, వాల్మీకి సంఘం నాయకులు పరమటయ్య, వేణుగోపాల్, శంకర్, శ్రీను పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో..
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 20 : మున్సిపల్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి శంకరాచారి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేశారు. జిల్లా క్రీడాశాఖ కార్యాలయంలో డీవైఎస్వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, అక్టోబర్ 20 : మున్సిపల్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ సత్తూ ర్ బస్వరాజ్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలా గే ఎంపీడీవో కార్యాలయంతోపాటు కరివెన గ్రామంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, ఎంపీడీవో మున్ని, కమిషనర్ నూరుల్నజీబ్, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, అక్టోబర్ 20 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కుల సంఘాల నాయకులు వాల్మీకి చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్ విజయ్, రాష్ట్ర బీసీసేన అధ్యక్షుడు కృష్ణయాదవ్, కుల సంఘాల నాయకులు నడిమింటి శ్రీనివాసులు, తెలు గు సత్తయ్య, ఇంజినీరు నర్సింహులు, కృష్ణయ్య, మండ్ల స్వామి, బాలరాజు, రాఘవేందర్, రఘు, టీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్, ఈటే శ్రీనివాస్, వెంకటేశ్గౌడ్, రాము పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మహబూబ్నగర్ రూరల్, అక్టోబర్ 20 : మండలంలోని కోడూర్, చౌదర్పల్లి గ్రామాల్లో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. కోడూర్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచులు శ్రీకాంత్గౌడ్, శంకరమ్మ, ఎంపీటీసీ రాజు, మన్యంకొండ ఆలయ కమిటీ సభ్యులు చిన్నయ్యగౌడ్, వార్డుసభ్యుడు కురుమ య్య, వాల్మీకి సంఘం నాయకులు బోయ రవి, కోటేశ్, శ్రీశై లం, కురుమయ్య, కొండయ్య, రాంచంద్రయ్య ఉన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 20 : మండలంలోని నేరళ్లపల్లిలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖలీల్, కోఆప్షన్ స భ్యుడు జమీర్పాషా, శ్రీశైలం, మల్లేశ్, కాశన్న తది తరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, అక్టోబర్ 20 : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలకేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయంలో వాల్మీకి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు బీ కృష్ణయ్య, హన్మంతు, మాధవీరెడ్డి, మొగులయ్య, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, నాయకులు ప్రవీణ్, లక్ష్మీనారాయణగౌడ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 20 : మండలకేంద్రంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, నరహరి, దస్తగిరి, కురుమయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 20 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలకేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా వాల్మీకి విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. కాగా, దేవరకద్రలో వాల్మీకి ఆలయ నిర్మాణానికి ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్ రూ.50వేల విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో..
మహ్మదాబాద్, అక్టోబర్ 20 : రామాయణ రచయిత వాల్మీకి మహర్షి జయంతిని మహ్మదాబాద్, గండీడ్ తాసిల్దార్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి తాసిల్దార్లు ఆంజనేయులు, జ్యోతి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.