పెద్దమందడి, అక్టోబర్ 20 : బీడువారిన ప్రతి గుంటకూ సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మోజర్ల గ్రామం వద్ద అరబిందో ఫార్మా, రాంకీ సంస్థ సహకారంతో రూ.కోటీ 75 లక్షలతో నిర్మిస్తున్న మోజర్ల శార ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శార గట్టు ఎత్తిపోతలను 45 రోజుల్లో పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. లిఫ్ట్లో భాగంగా ఏర్పాటు చేసే పైపులైన్ వచ్చే భూ రైతులు సహకరించాలన్నారు. శంకరసముద్రం నుంచి మోజర్ల రైతులకు సాగునీరు అందించేందుకు ఈ లిఫ్ట్ను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీడు భూములకు సాగునీరు అందించి పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయడమే తన లక్ష్యమన్నారు. రైతుల బాగు కోసం కార్పొరేట్ సంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించామని చెప్పారు. రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాష్రెడ్డి, సర్పంచులు సునీత, రమేశ్, మాజీ విండో అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రం యాదవ్, అరబిందో ఫార్మసీ, రాంకీ కంపెనీల డైరెక్టర్లు నిత్యానందరెడ్డి, శరత్చంద్రారెడ్డి, సదానందరెడ్డి, రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు శివశంకర్, శ్రీనివాస్రెడ్డి, విండో డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, మద్దిగట్ల మాజీ ఎంపీటీసీ సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలి..
వనపర్తి, అక్టోబర్ 20 : రామాయణాన్ని మధుర కావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు, ఆది కవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నాగవరంలో వాల్మీకి విగ్రహానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి హాజరై వాల్మీకి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నతమైన ఆదర్శాలు, మానవతా విలువలను రామాయణం అడుగడునా మనకు బోధిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, అంకిత్, వాల్మీకి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ నాయుడు, కమిషనర్ మహేశ్వర్రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి కేశవులు, రాష్ట్ర అధ్యక్షుడు రాంమూర్తి నాయుడు, వేణుగోపాల్, నాయకులు విజయ్కుమార్, తిరుమల్, శ్రీను, ప్రజాప్రతినిథులు, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.