ముంబై : కరోనా బారినపడిన లెజెండరీ సింగ్ లతామంగేష్కర్ కోలుకుంటున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ లతాజీకి చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీతో మాట్లాడినట్లు చెప్పారు. క్రమంగా కోలుకుంటున్నారని.. ప్రస్తుతం వెంటిలెటర్పై లేరన్నారు. కేవలం ఆక్సిజన్ మాత్రమే అందిస్తున్నారని, చికిత్సకు ఆమె స్పందిస్తున్నారన్నారు. కొవిడ్తో పాటు న్యుమోనియా నిర్ధారణ కాగా ఈ నెల 8న ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. అయితే, ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో రెండు రోజుల కిత్రమే వెంటిలెటర్ సపోర్ట్ను తొలగించామని చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ పేర్కొన్నారు.