ఆలేరు రూరల్, ఫిబ్రవరి 27: మార్చి ఒకటిన నిర్వహించే మాదిగ అమరుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరులో ఆదివారం నిర్వహించిన మాతమ్మ జాతరకు ఆయన హాజరై, పూజలు చేశారు. అనంతరం వంగపల్లి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధన, ఇతర అన్ని ఉద్యమాల్లో మాదిగలు కీలకపాత్ర పోషించారని తెలిపారు. మార్చి ఒకటిన అమరవీరుల దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.