టెహ్రాన్: హొర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అనేక చమురు, సరుకు రవాణా నౌకలు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే జపాన్ నుంచి దుబాయ్కు చేరాల్సిన అనేక లగ్జరీ కార్లు కెన్యా తీరంలో చిక్కుకుపోయినట్టు తెలిసింది.
ఇప్పటికే దాదాపు 4 వేల కార్లు అక్కడ చిక్కుకుపోగా, వచ్చే వారం మరో 5 వేల వాహనాలు రానున్నాయి. జపాన్లోని యోకోహామా నుంచి గత నెలలో ఈ నౌకలు బయలుదేరాయి.దుబాయ్లోని జాబెల్ అలీ పోర్టుకు ఇవి చేరాల్సి ఉన్నది. ఇంతలో యుద్ధం మొదలు కావడంతో ఓ నౌకను కెన్యాలోని పోర్టుకు మళ్లించారు.