తిరుపతి : మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ( Lunar eclipse ) సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ ( TTD ) ఆధ్వర్యంలోని అన్నప్రసాద ( Annaprasadam ) వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు వివరించారు.
తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు , వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు , వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేస్తామన్నారు.