హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో రాగల 24 గం టల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం సముద్రమట్టానికి 3.1 కి లోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్నదని, ఇది పశ్చి మ దిశగా ప్రయాణించొచ్చని పేర్కొన్నది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కిందిస్థా యి గాలులు వీస్తున్నాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం, 29, 30 తేదీల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురి సే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మరోవైపు, రా ష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.1 డిగ్రీలు రికార్డయినట్టు పేర్కొన్నది.