మంచిర్యాల జిల్లాలోని ఓ పట్టణంలో ‘లవ్ కేసీఆర్ సెల్ఫీ స్పాట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రారంభించి, కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ‘లవ్ కేసీఆర్’ సెల్ఫీ స్పాట్ను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడ టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు సెల్ఫీ తీసుకుని మురిసిపోయారు.