ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో లారీ డ్రైవర్ కుమారుడు వర్షిత్ గౌడ్ 98.7శాతం మార్కులతో సత్తాచాటాడు. హైదరాబాద్ పెద్దఅంబర్పేటలోని క్యాండర్ షైన్ పాఠశాల విద్యార్థి వర్షిత్.. జాతీయస్థాయిలో 3వ ర్యాంకు, దక్షిణాదిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకొన్నాడు.
మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో వర్షిత్గౌడ్ను అభినందించారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి, మంచి మార్కులు సాధించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. వర్షిత్ వెంట పాఠశాల చైర్మన్ మల్లారెడ్డి, మీర్పేట టీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్రెడ్డి తదితరులు ఉన్నారు.