న్యూఢిల్లీ: భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్.. అమెరికాలోని ఒరేగాన్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇవాళ జరిగిన హీట్స్లో అతను 8 మీటర్లు దూకి ఫైనల్కు అర్హత సాధించాడు. హీట్స్లో అతను ఏడో స్థానంలో నిలిచాడు. అయితే ఇదే ఈవెంట్లో పోటీపడ్డ జస్విన్ ఆల్డ్రిన్, మొహమ్మద్ అనీస్ యాహియాలు ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. హీట్స్లో టాప్12లో ఇద్దరూ చోటు సంపాదించలేకపోయారు. దీంతో ఆ ఇద్దరూ ఫైనల్కు అర్హత సాధించలేదు.
జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పిన లాంగ్ జంపర్ శ్రీశంకర్.. వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నీలో డార్క్హార్స్గా పోటీలోకి దిగాడు. ఈ సీజన్లో 23 ఏళ్ల శ్రీశంకర్ టాప్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల గ్రీస్లో జరిగిన ఈవెంట్లో అతను 8.31 మీటర్ల దూకాడు. జాతీయ అంతరాష్ట్ర చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు.