మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నారు. స్పం దించిన పంచాయతీ కార్యదర్శి బుధవారం పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయగా గ్రామస్తులు ట్యాంకర్ దగ్గర గుమిగూడి తోపులాట మధ్య నీటిని తీసు కెళ్లారు. వేసవిలో బోరుబావిలో నీరు తగ్గి సమస్య వచ్చే అవకాశం ఉందని గతంలోనే ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నూతన బోరు బావిని తవ్విస్తానని చెప్పి ఇప్పటికీ తవ్వించలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-దోమ,మే 20