నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకకు హాజరైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గర్భాలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన స్వయంగా రథాన్ని లాగారు.
కార్తీక మాసం సందర్భంగా గురువారం రాత్రి శ్రీశైలంలో జ్వాలాతోరణాన్ని వేడుకగా నిర్వహించారు. అంతకుముందు కృష్ణా నదికి గంగాహారతులిచ్చారు. చీరసారెలు, పసుపుకుంకుమ, గాజులు వాయనంగా సమర్పించినట్టు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం అర్చక వేదపండితులతో కలిసి పాతాళగంగ వద్ద కృష్ణమ్మతల్లి విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం 11 మంది అర్చకులతో 11 రకాల హారతులను నదీమ తల్లికి ఇచ్చి చేతులు జోడించి నమస్కరించారు.