హైదరాబాద్, ఫిబ్రవరి 12: బీమా దిగ్గజం మెగా ఐపీవోకు సంస్థ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఆఫర్ ముసాయిదా డాక్యుమెంట్లో చిన్న మార్పులను, వివరణలనూ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అవి అందిన తక్షణమే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీహెచ్ఆర్పీ)ను ఆమోదించడానికి 15 మంది సభ్యులుగల బోర్డు మళ్లీ వెనువెంటనే సమావేశమవుతుందని ఆ వర్గాలు వివరించాయి. డీహెచ్ఆర్పీకి బోర్డు అంగీకారం లభించిన మీదట, సోమ, మంగళవారాల్లో ప్రాస్పెక్టస్ను సెబీకి సమర్పిస్తారు. అటుతర్వాత సెబీ ప్రాస్పెక్టస్ను పరిశీలించి, అంగీకరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఐపీవో ప్రాస్పెక్టస్పై నిర్ణయం తీసుకునేందుకు సెబీకి 2,3 నెలలు సమయం పడుతుంది. కానీ ఎల్ఐసీ ప్రాస్పెక్టస్ అందిన మూడు వారాల్లోగా క్లియర్ చేయాలంటూ రెగ్యులేటర్ను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. వచ్చే నెలాఖరు లోగా ఎల్ఐసీ ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది.