హైదరాబాద్ : ఆందోళన వద్దు.. కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం, మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు, సీఐ లు, ఎస్సైలు, డీఎం& హెచ్ఓ, డాక్టర్లతో మంత్రి మాట్లాడారు. కరోనా బాధితుల యోగ క్షేమాలు, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో వారు పంచుకున్నారు. ఎలాంటి ఆపద వచ్చిన ఒక్క ఫోన్కాల్తో అందుబాటులో ఉంటానని ధైర్యంగా ఉండాలని మంత్రి సూచించారు.