‘లవర్’ చిత్రం ద్వారా తెలుగుతెరపై అరంగేట్రం చేసింది మలయాళీ సోయగం రిద్దికుమార్. అనంతరం ఇతర భాషా చిత్రాల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్కు దూరమైంది. ఈ నెల 11న విడుదలకానున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో ఆమె ఆర్చరీ స్పోర్ట్స్ విమెన్గా కీలక పాత్రలో నటించింది. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర గురించి రిద్దికుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం నేను ఆర్చరీలో (విలువిద్య) శిక్షణ తీసుకున్నా. ప్రభాస్గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇటలీ షెడ్యూల్ చాలా సరదాగా గడచిపోయింది. సినిమాలో నా క్యారెక్టర్ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం కొన్ని సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తున్నా. స్వతహాగా నాకు డిటెక్టివ్, వినోదం కలబోసిన పాత్రలంటే ఇష్టం. తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నా అభిమాన హీరోలు. టాలీవుడ్లో మరిన్ని మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది.