షాజహాన్పూర్: యూపీలోని షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఒక న్యాయవాదిని మరో న్యాయవాది పాత కక్షలతో కాల్చిచంపాడు. సురేశ్ కుమార్ గుప్తాపై మృతుడు భూపేంద్ర సింగ్ (58) పాతిక కేసుల దాకా పెట్టాడు. దీంతో భూపేంద్రపై గుప్తా కక్ష కట్టాడు. ఒక కేసుకు సంబంధించి క్లర్క్ను కలిసేందుకు భూపేంద్ర కోర్టు భవనం మూడో ఫ్లోర్కు వెళ్లినప్పుడు అతన్ని గుప్తా కాల్చిచంపాడు. గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.