రామగిరి, మార్చి 26 : చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే పర్యాయం ఐదుగురు హైకోర్టు జడ్జిలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నల్లగొండ, జిల్లా కోర్టు బార్ అసోసియేసన్ ఆహ్వానం మేరకు వచ్చిన వారికి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లా కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, షటిల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం బార్అసోసియేషన్ సమావేశ మందిరంలో బార్ అసిసోసియేషన్ అధ్యక్షుడు మేడ మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైకోర్టు జడ్జి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్, షటిల్ కోర్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.