పుస్తకాలు ఆవిష్కరించిన సీఎస్
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర చట్టాలకు సంబంధించిన మొత్తం సమాచారం ఒకే దగ్గర లభించడం గొప్ప విషయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చెప్పారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ‘రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు’ అనే 15 సంపుటాలను ఆయన ఆవిషరించారు. సుమారు తొమ్మిది వేల పేజీలతో కూడిన ఈ సంపుటాలను ముద్రించడం చాలా కఠినమైన పని అని, దీనిని విజయవంతంగా నిర్వహించిన న్యాయ విభాగ అధికారులను సీఎస్ అభినందించారు. వీటిని రాష్ట్రంలోని కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, హైకోర్టుకు పంపుతామని న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి తెలిపారు. https:law.telangana.gov.in/statelaws వెబ్సైట్లో వీటిని అప్లోడ్ చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ పరిపాలన న్యాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.