అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృత దేహాలను ఆ రోజే గుర్తించగా ఆరుగురి మృత దేహాలను శనివారం గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సాయితేజ మృతదేహాన్ని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి సాయంత్రం వరకు చేరకుంటే అంత్యక్రియలు ఈ రోజు చేపట్టలేమని, రేపు నిర్వహిస్తామని సాయితేజ తమ్ముడు మహేశ్ వెల్లడించారు. మృతదేహాన్ని రేపు ఆదివారం(Sunday)తమకు అప్పగించాలని ఆయన ఆర్మీ అధికారులను కోరాడు.
కాగా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఆర్మీ అధికారులు గ్రామానికి చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాయితేజ సీడీఎస్ బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.