బెంగళూరు, మార్చి 18: దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పలు సంస్థలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వేలల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు ముందుకురాగా..తాజాగా దేశంలో తొలి ప్రాప్టెక్ యూనికార్న్ నోబ్రోకర్ కూడా ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ ప్లాట్ఫాంలో నమ్మకమైన ‘ఎలక్ట్రిక్పే’తో కలిసి రెసిడెన్షియల్ కమ్యూనిటీల్లో లక్ష చార్జింగ్ స్టేషన్లను హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఇతర మెట్రో నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. భారత్లో 50 లక్షల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల అవసరం ఉంటుందని, దీంతో పలు రెసిడెన్షియల్ కమ్యూనిటీతో ఒప్పందం కుదుర్చుకొని వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.