న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ వెంట కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో రేపు భారత్ – చైనా మధ్య 13వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చైనాలోని మోల్డోలో ఆదివారం ఉదయం 10.30గంటలకు చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. హాట్ స్ప్రింగ్స్తో పాటు పలు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చించే అవకాశం ఉన్నది. ఇరు దేశాల మధ్య జూలై 31న 12వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి.
దాదాపు తొమ్మిది గంటల పాటు సాగిన చర్చల్లో తూర్పు లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రాతో పాటు పలు కీలకమైన ప్రాంతాల్లో బలగాలు, ఆయుధాలను తర్వగా ఉపసంహరించాలని భారత్ స్పష్టం చేసింది. అంతకు ముందు జూలై 14న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. చైనా మంత్రి వాయింగ్ యీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. షాంఘై సహకార సమావేశం (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న పరిస్థితులు, సమస్యలపైనా చర్చించారు.