అమరావతి : వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(MP Sanjeev Kumar) గురువారం ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ(TDP) లో చేరారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను టీడీపీలో చేరానని వెల్లడించారు. వైసీపీలో సామాజిక న్యాయం లేదని ఆయన విమర్శించారు.
బీసీలకు తగిన ప్రాధాన్యత లేదని దుయ్యబట్టారు. తాను ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే టీడీపీలో చేరానని స్పష్టం చేశారు. కర్నూలుకు తాగునీరు ఇవ్వలేనప్పుడు వైసీపీ(YCP) లో ఎందుకని రాజీనామా చేసినట్లు వివరించారు. రాబోయే ఐదేండ్ల చంద్రబాబు పాలనలో కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. వైసీపీలో సీఎం అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమేనని ఆరోపించారు.