బెంగళూర్ : కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే కే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసిన అనంతరం కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస గౌడతో పాటు మరో ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్ కూడా జేడీ(ఎస్)కు ఓటు వేయలేదని అన్నారు.
కాషాయ పార్టీకి బీ టీంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ దేశంలో బీజేపీ ఎదుగుదలకు బాధ్యత వహించాలని చెప్పారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ (దేవెగౌడ కుమారుడు) కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ డీకే శివకుమార్కు తన బ్యాలెట్ పేపర్ను చూపారని, రేవణ్ణ ఓటును చెల్లుబాటు కాకుండా చూడాలని బీజేపీ ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్కు ఓటు వేశానని ఆ పార్టీపై ఇష్టంతోనే తానలా చేశానని కర్నాటక జేడీ(ఎస్) నేత కే శ్రీనివాస గౌడ తెలిపారు.