హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం అవివేకమని, రాజకీయంగా ఎదుర్కొలేని దుష్ట శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(
KTR) అన్నారు. ఇటీవల పెద్దపల్లి(Peddapalli) జిల్లా రామగిరి మండలం బేగంపేటలో గుండాల దాడిలో గాయపడిన మాజీ సర్పంచ్ బుర్ర పద్మ భర్త శంకర్ గౌడ్ను(Shankar Goud) సోమవారం హైదరాబాద్లో పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుకొని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పని చేస్తున్న శంకర్ గౌడ్కు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు.
ఆయన భార్య ఒకసారి ఎంపీటీసీగా రెండోసారి సర్పంచ్గా ఎన్నికైనట్లు తెలిపారు. పదేళ్లుగా గ్రామ అభివృద్ధికి పాల్పడుతున్న క్రమంలో వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో పోటీ చేసి గెలివలేని అరాచక వాదులు తమ కార్యకర్తలపై దాడులకు ఉసిగొలపుతున్నారని, దాడులు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. దుండగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దాడులతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే లీగల్ సెల్కు తెలుపాలన్నారు.