KTR | ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆధారాలు లేపేసిండని విమర్శించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మేమంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేశారని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసు జగద్విదితమని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 2015లో ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50లక్షల బ్యాగుతో కెమెరాల ముందు దొరికాడని గుర్తుచేశారు. ఈ కేసు నుంచి బయటపడటానికే రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని అన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ న్యాయస్థానంలో తుది దశకు వచ్చిందని తెలిపారు. చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి పన్నిన కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు.
దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని కేటీఆర్ విమర్శించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా అని ఆయన నిలదీశారు. చలికాలం పొద్దున 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందట.. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు మనం నమ్మాలా అని ప్రశ్నించారు. ఇది చేయించబడిన అగ్ని ప్రమాదం అని అన్నారు. తన క్రిమినల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డినే ల్యాబ్ను తగులబెట్టించాడని తెలిపారు.
అల్లు అర్జున్ జులాయి సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసిన వెంటనే దొరికినట్లు, రేవంత్ రెడ్డి కూడా చేసిన వెంటనే దొరుకుతాడు
ఓటుకు నోటు కేసులోని ఆధారాలను తగలబెట్టేందుకే రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రజలు అందరూ అనుకుంటున్నారు
ఒక నేరస్తుడే… https://t.co/0eVULrofDb pic.twitter.com/zIkxw8XqUo
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2026
నేరాల విచారణలో ఫోరెన్సిక్ కీలక విభాగమని కేటీఆర్ తెలిపారు. వేలాది కేసుల వివరాలు అగ్గికి బుగ్గి అయ్యాయని పేర్కొన్నారు. ఎంతోమంది క్రిమినల్స్ తప్పించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఎఫ్ఎస్ఎల్ ప్రకటన తూతూ మంత్రంగా ఉందని తెలిపారు. ఏం నష్టం జరగలేదంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఇన్స్పెక్టర్ నిజాయితీగా పనిచేశాడని చెప్పారు. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో స్పష్టంగా రాశారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల దాకా మంటలు అదుపు చేయలేదని.. బుడ్డ బిల్డింగ్లో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పట్టిందా అని ప్రశ్నించారు. సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి పోలీసులు సహకరించారని అన్నారు. మూడు అంతస్తుల భవనంలో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పడుతుందంటే నమ్మాలా అని ప్రశ్నించారు. మొదటి అంతస్తులో మంటలు ఆర్పడానికే మూడు గంటలా అని నిలదీశారు.
ప్రెస్ నోట్లో ఏమో ఏమీ నష్టం జరగలేదు అని చెప్పి బుకాయించి.. FIRలో మాత్రం వివరంగా రాసి దొరికిపోయారు
మంటలు అదుపు చేయడానికి మూడున్నర గంటలు పట్టిందని FIRలో రాశారు
3 అంతస్తుల బుడ్డ భవంతిలో మంటలు ఆర్పడానికి మూడున్నర గంటల సమయం ఎందుకు పట్టింది?
మంటలు ఆర్పడానికి మూడున్నర గంటల సమయం… https://t.co/7mCsPEkbf5 pic.twitter.com/CjqpmG6Q9w
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2026
ముఖ్యమైన కేసుల సమాచారం అంతా మొదటి అంతస్తులోనే ఉందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎవరూ డ్యూటీలో లేరట.. మీడియాను మేనేజ్ చేసి తిమ్మిని బమ్మి చేశారని మండిపడ్డారు. ఏం జరగలేదని తప్పు అని ఒక ఇన్స్పెక్టర్ చెప్పారని తెలిపారు. సర్వర్ రూమ్ కూడా కాలిపోయిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని చెప్పారు. సర్వర్లు కాలబెట్టినంక ఇంకేం ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. కుట్ర విజయవంతంగా పూర్తిచేశారని అన్నారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయని చెబుతున్నారని తెలిపారు. ఒక ప్రభుత్వం తమ ప్రభుత్వ కార్యాలయాన్ని తామే కాల్చిపారేయడం దేశంలో ఎక్కడా జరగదని విమర్శించారు.
దొంగ, చీకటి ఏకమయ్యాయని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రే దొంగ అని అన్నారు. కేంద్రంతో రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడని తెలిపారు. అమిత్ షా కాళ్లు పట్టుకుని అడుక్కున్నాడని పేర్కొన్నారు. చివరకు సాక్ష్యాధారాలను మాయం చేసే డెడ్లీ కుట్ర చేసిండని అన్నారు. ఇందులో కుట్రను కేంద్రం నిగ్గుతేల్చాలని కోరారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగిందే.. ప్రమాదం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వేల కేసుల ఆధారాలు బుగ్గి చేశారని కేటీఆర్ మండిపడ్డారు. నేరగాళ్లు, రేపిస్టులు, దుర్మార్గులకు శిక్ష పడే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మేం సైంటిస్టులను తీసుకొని వస్తం.. మమ్మల్ని రానివ్వండి అని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో లాలూచీ లేకపోతే.. కేంద్రం ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అంటాడని.. బడే భాయ్, ఛోటే భాయ్ బంధం లేకపోతే వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కుంభకోణాన్ని మేం బయటపెట్టినం.. సీఎం బామ్మర్ది పాత్ర ఉందని బయటపెట్టినం.. కానీ కేంద్రం విచారణ జరపడం లేదని తెలిపారు. దారుణ నేరానికి ఒడిగట్టిన నేరగాడిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనకాల ఓటుకు నోటు కేసుకు సంబంధం ఉన్న మరొక పెద్దమనిషి హస్తం కూడా ఉన్నట్లు అనుమానం ఉంది
ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కొంతమంది మద్దతుతో నడుస్తుంది.. వారికి ఈ ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్నది
వారు ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ సుపారీ తీసుకొని చేశారో కూడా… https://t.co/GzRtTg3kj1 pic.twitter.com/DcLOPlvY3h
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2026