హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారంతో 49వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సచిన్తో దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘లెజెండ్ సచిన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, స్టే బ్లెస్స్డ్ సచిన్ జీ’అని ట్వీట్ చేశారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అరటి పండ్లు తింటూ వినూత్నంగా మాస్టర్కు బర్త్డే విషెస్ తెలుపగా.. వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, బీసీసీఐ కార్యదర్శి జై షా సహా పలువురు సోషల్ మీడియాలో సచిన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.