హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలు కోసం కృష్ణా నదీ యాజమాన్య మండలి (జీఆర్ఎంబీ) ప్రత్యేకంగా ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను తెలుపుతూ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే గురువారం ఇరు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాశారు. రివర్ బోర్డ్ల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జూలై 15న గెజిట్ విడుదల చేయగా, దాని అమలు, పర్యవేక్షణ, ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరానికి తొలుత కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నిర్వహించిన 14వ బోర్డ్ మీటింగ్లో ఇరు రాష్ట్రాలు పలు సూచనలు చేశాయి.
ఇప్పటికే ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీ స్థానంలో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగా తాజాగా కేఆర్ఎంబీ సబ్కమిటీని ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబీ మెంబర్ ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. మెంబర్ సెక్రటరీ, ఎక్స్పర్ట్ మెంబర్ (పవర్), తెలంగాణ, ఏపీకి చెందిన ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్స్ చీఫ్ ఇంజినీర్లు, జెన్కో చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉండనున్నారు. సాంకేతికత ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం, లేదంటే ఇతర నిపుణులను కూడా కో ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ సబ్కమిటీ గెజిట్ అమలు కోసం అవసరమైన వ్యవస్థాగత ఏర్పాట్లు, ప్రాజెక్టుల నియంత్రణ, కేంద్ర బలగాల భద్రత తదితర అంశాలను పరిశీలిస్తుందని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ బీపీ పాండే ఆ లేఖలో వెల్లడించారు.