Lords Test : లార్డ్స్ టెస్టులో జోరు చూపిస్తున్న భారత జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్లో రెచ్చిపోయిన క్రాంతి గౌడ్(1-7).. మళ్లీ ఇంగ్లండ్ను వణికిస్తూ వికెట్ల వేట ఆరంభించింది. డిఫెన్స్ ఆడాలనుకున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(0)ను ఇన్ స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేసిందీ పేసర్. సయాలీ సత్ఘరే(1-2) ఓవర్లో మైయా బౌచియర్(2) వెనుదిరగగా.. 6 పరుగులకే ఓపెనర్లను కోల్పయింది ఆతిథ్య జట్టు.
లంచ్ తర్వాత భారత జట్టు 341 /7 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(0), మైయా బౌచియర్(2)లు 6 పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(6 నాటౌట్), హీథర్ నైట్(6 నాటౌట్)లు జాగ్రత్తగా ఆడుతున్నారు.
Fast bowling simply doesn’t get any better than this 🔥
Kranti Gaud & Sayali Satghare with dream deliveries to dismiss both England openers early 👊
Updates ▶️ https://t.co/O1rEau8j8n #TeamIndia | #ENGvIND pic.twitter.com/gZK4SozP4s
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
మరో 48 ఓవర్లు ఉన్నందున.. చెరొక వికెట్ తీసిన క్రాంతి గౌడ్(7-1), సయాలీ సత్ఘరే(1-2) ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలడం ఖాయమనిపిస్తోంది. వీడ్కోలు మ్యాచ్లో డకౌటైన టమ్మీ బ్యూమంట్కు భారత క్రికెటర్లు, అంపైర్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ.. కరచాలనం చేశారు.