కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం పల్లెలు అభివృద్ధిలో పురోగతి సాధించి ముందుకు వెళ్తున్నదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్య సమస్యలను పరిష్క రించేందుకు ట్రాక్టర్లు ప్రభుత్వం అందించిందని ఆయన గుర్తు చేశారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రిదే అని, 70 ఏండ్లల్లో సాధ్యం కానీ అభి వృద్ధిని ఏడేండ్లలోనే సాధించామని రవీంద్రకుమార్ అన్నారు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగితే రైతుకు బీమా కింద రూ.5లక్షలు బాధిత కుటుంబాలకు అసరా అవుతుందని ముఖ్యమంత్రి రైతు బీమాను అమలు చేశా రన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. అనంతరం అదే తండాలో త్రీ ఫేజ్ ట్రాన్స్పార్మర్ను ఆయన ప్రారంభించారు.
తండాల్లో సబ్ ప్లాన్ కింద నియోజకవర్గంలో 194 త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్య క్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంబం శ్రీనివాస్గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దశ్రునాయక్, పసునూరి యుగేందర్రెడ్డి, మాడ్గుల యాదగిరి, బొడ్డుపల్లి కృష్ణ, తులసీరాం, పీఆర్డీఈ జీవన్సింగ్ పాల్గొన్నారు.