ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు టీమ్ఇండియా కెప్టెన్సీని ఏకకాలంలో నడిపిన విరాట్ కోహ్లీ.. బ్యాట్తో ఆకట్టుకున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తూ.. జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఐపీఎల్లో బెంగళూరును ఒక్కసారి కూడా విజేతగా నిలుపలేకపోవడంతో విరాట్పై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రోహిత్ శర్మ ముంబైకి ఐదు ట్రోఫీలు అందించడంతో కోహ్లీపై ఒత్తిడి మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా సారథ్యానికి వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఐపీఎల్-15వ సీజన్ ఆరంభానికి ముందే బెంగళూరు కెప్టెన్సీకి బైబై చెప్పేశాడు. అయితే కెప్టెన్సీ భారం ఉన్న రోజుల్లోనూ రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన కోహ్లీ.. తాజా సీజన్లో ఆటగాడిగా విఫలమవుతుండటం ఇబ్బందికరంగా మారింది. ఇక ఇతర జట్ల విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్, సన్రైజర్స్ హైదరాబాద్ నాయకుడు కేన్ విలియమ్సన్ పరిస్థితి కూడా పెద్ద ఆశాజనకంగా లేదు. కేఎల్ రాహుల్ (లక్నో), హార్దిక్ పాండ్యా (గుజరాత్), సంజూ శాంసన్ (రాజస్థాన్), ఫాఫ్ డుప్లెసిస్ (బెంగళూరు) బ్యాట్తో ఫర్వాలేదనిపిస్తున్నారు.