కోదాడ: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దండుకుని అవినితికి పాల్పడ్డ ఉత్తమ్కు తనను విమర్శించే అర్హత లేదని.. తాను ఎమ్మెల్యేగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్లాది రూపా యల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని కళ్లుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు.
మంగళవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉత్తమ్కుమార్ రెడ్డి తనపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే తిప్పికొట్టారు. నియోజకవర్గంలో ఇప్పుడు మద్యం వ్యాపారం చేస్తుంది కాంగ్రెస్ నాయకులేనని విమర్శించారు. గతంలో హైదరాబాద్లో వ్యాపారం చేసి కొన్న భూములకు రేట్లు పెరిగాయని, వాటిని అమ్మి ఇండ్లు కడుతున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు.
సొంత గడ్డపై మమకారంతో ప్రజాసేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని 15 సంవత్సరాలుగా ప్రజల కష్టసుఖా ల్లో భాగస్వామ్యం అవుతున్నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకతీతం గా అన్నివర్గాలకు పథకాలు అమలవుతున్నాయన్నారు. ఉత్తమ్ కుమార్కు కూడా రైతుబoధు ఇస్తున్నామన్నారు.
మునగాల మండలంలో ఎంపీపీ భర్త చెరువు శిఖం భూమి ఆక్రమించడం వల్లే అధికారులు చట్టపరమైన చర్యలు తీసు కున్నారని, చట్టం పరిధిలో అందరూ సమానులే అని అన్నారు. భూస్వామ్య అవలక్షణాలు పుణికి పుచ్చుకున్న ఉత్తమ్ ప్రజలలో తనకున్న ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈర్షలతో అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
24 గంటలు సేవ చేసేందుకు ఎవరూ అందుబాటులో ఉంటున్నారో నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు. పార్టీలకతీ తంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దికి కృషి చేస్తున్నానని, ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కూడా తెలుసునన్నారు. స్థానికంగా ఉండి రాజకీయంగా ఎదుగుతున్న తనపై ఈర్షతో ఆరోపణలు చేస్తున్నారని అనవసర ఆరోపణలు చేస్తే తగిన సమయంలో తగిన సమాధానం చెప్తామన్నారు.
సమావేశంలో నియోజకవర్గ రైతు బంధు సమితి సభ్యుడు సుంకర అజయ్కుమార్, పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు, కోదాడ మండలపార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్, తొగరు రమేశ్, వంటిపులి నాగరాజు, వెంపటి మధు, యుగంధర్ రెడ్డి, కొండా సైదయ్య, శివాజీ, వల్లూరి రామిరెడ్డి, ఉపేందర్, పల్లా నర్సిరెడ్డి, సైదులు. పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.