ముంబై: వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు అదిరే ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగడంతో ఆ జట్టు పవర్ప్లే ఆఖరికి 59/0తో నిలిచింది. ముఖ్యంగా అగర్వాల్ భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. 8 ఓవర్లకు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్(34), అగర్వాల్(34) భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. ఈ జోడీని విడదీసేందుకు ఢిల్లీ బౌలర్లు శ్రమిస్తున్నారు.