హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ డిసెంబర్తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను నికర లాభంలో 76 శాతం వృద్ధి కనబరిచింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.47.8 కోట్లుగా ఉంటే, ఈసారి రూ.84.20 కోట్లకు ఎగబాకింది. కరోనాతో గత రెండేండ్లుగా అంతంతగానే ఉన్న వ్యాపారం తిరిగి కోలుకున్నట్టు కిమ్స్ దవాఖాన ఎండీ బీ భాస్కర రావు తెలిపారు. గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.396 కోట్ల ఆదాయాన్ని గడించింది.