కూసుమంచి, డిసెంబర్ 3: చిన్న తిరుపతిగా పేరుగాంచిన జీళ్లచెరువు వేంకటేశ్వస్వామి ఆలయాన్ని తన శక్తిమేరకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువు గుట్టమీద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న గోవింద నామాల మండపం, గోశాల, యోగా, ధ్యాన మందిరాలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఆయన సతీమణి విజయమ్మ, ఎమ్మెల్సీ తాతా మధు శనివారం శంకుస్థాన చేశారు. ఈ సందర్బంగా జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. తిరుపతి వెళ్లలేని భక్తులు జీళ్లచెరువు వచ్చి ఇక్కడి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారని అన్నారు. జీళ్లచెరువు గుట్టమీదకి రహదారి బాగలేనందున గతంలో వేసిన రోడ్డును నాలుగు లైన్లుగా నిర్మిస్తున్నామని, ఆలయ వరకూ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వంటివి వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖర్చునంతా తానే భరిస్తానని అన్నారు.
అన్ని మతాలకూ సముచిత స్థానం: ఎమ్మెల్సీ తాతా మధు
తెలంగాణలో అన్ని కులాలు, మతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. గోవింద నామాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తోందని గుర్తుచేశారు. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మాట్లాడుతూ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు మరికంటి ధనలక్ష్మి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి బేబీ, కొండా సత్యం, అంబాల ఉమ, బొడ్డు నరేందర్, యండపల్లి వరప్రసాద్, ఎంపీపీ బెల్లం ఉమ, వేముల వీరయ్య, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య పాల్గొన్నారు.