మధిరటౌన్, ఆగస్టు 14: మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆవుల సంతోశ్కుమార్, కోశాధికారి భుక్యా హనుమా, ఉపాధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు, జింకల కోటేశ్వరరావు, చల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మధిర చెరువులో స్విమ్మర్స్ అందరూ కలిసి 75 నెంబర్ ఆకారంలో ఏర్పడి దేశభక్తిని చాటుకున్నారు.
బోనకల్లు, ఆగస్టు 14: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
మధిరటౌన్, ఆగస్టు 14: స్థానిక టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అబ్బుర పరిచారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 14: ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన సంసృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు నృత్యాలు, నాటికలు, దేశభక్తి గేయాలతో అలరింపజేశారు. ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా విద్యాధికారి యాదయ్య, కార్పొరేటర్ కె.మురళి, ఆర్సీవోలు ప్రత్యూష, జ్యోతి, సీఎంవో రాజశేఖర్ పాల్గొన్నారు.
రఘునాథపాలెం, ఆగస్టు 14 : ఖమ్మం నగరం శ్రీవైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కమాన్బజార్ వేంకటేశ్వర స్వామి ఆల యం నుంచి జాతీయ జెండాలతో 2కే రన్ నిర్వహించారు.
వజ్రోత్సవాల్లో ఉదయాన్నే ఇంటింటికీ వార్తా పత్రికలను చేరవేసే పేపర్ బాయ్ భాగస్వామ్యం వహిస్తున్నాడు. మండలంలోని వేపకుంట్లకు చెందిన పేపర్ బాయ్ వెంకటేశ్వర్లు తన సైకిల్కు జాతీయ జెండాను కట్టుకొని పేపర్ వేస్తున్నాడు. గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నాడు.