డర్బన్: లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (7/32) విజృంభించడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా 220 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్లో 53 పరుగులకే ఆలౌటైంది. ఢాకాను తలపించిన డర్బన్ పిచ్పై సఫారీ స్పిన్నర్లు పండుగ చేసుకున్నారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కేశవ్ మహరాజ్ ఏడు వికెట్లతో సత్తాచాటితే.. హర్మెర్ మూడు వికెట్లు పడగొట్టాడు.