దుబాయ్: దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్, ఆస్ట్రేలియా మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను పురుషుల విభాగంలో కేశవ్కు.. మహిళల విభాగంలో హీలీకి ఐసీసీ సోమవారం పురస్కారాలు ప్రకటించింది. గత నెలలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో హీలీ 170 పరుగులతో అదరగొడితే.. బంగ్లాదేశ్పై టెస్టు సిరీస్ పట్టడంలో కేశవ్ కీలక పాత్ర పోషించాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో అతడు 16 వికెట్లు పడగొట్టాడు. అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని.. భవిష్యత్తులో ఇదే ప్రదర్శన కొనసాగిస్తామని పురస్కార గ్రహీతలు వెల్లడించారు.